1996 వచ్చిన శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రాజమండ్రి సెంట్రల్ జైల్లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ ముగియగానే తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా 2020 ఏప్రిల్ 14న ‘భారతీయుడు 2’ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అప్పుడు మ్యాజిక్ చేసిన ఈ సినిమా మళ్ళీ అదే మ్యాజిక్ ను కొనసాగిస్తుందో? లేదో? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: