పక్క దేశంలో మన హీరోలకు పెరుగుతున్న క్రేజ్

మొత్తానికి మన తెలుగు హీరోలకి మన తెలుగులో మాత్రమే కాకుండా పక్క దేశాల్లో కూడా అభిమానులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు మన హీరోలకుఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఇటీవల ప్రభాస్ కోసం జపాన్ నుండి మహిళా అభిమానులు రాగా ఇప్పుడు మరో హీరోకు కూడా అలనాటి అనుభవమే ఎదురైంది. ఆ హీరో ఎవరో కాదు.. విభన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పర్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్ ఇటీవల మరోసారి ‘ఎవ‌రు’ అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడు. ఈ సినిమా కలెక్షన్స్ తోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఇక్కడే కాదు విదేశాల‌లోనూ విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. రినా అనే జ‌ప‌నీస్ అమ్మాయికి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసిందంట.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను చూసిన రీనా మట్సుయ్ అనే జపనీస్ యువతి.. శేష్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆమెను కలవడానికి శేష్ ఒప్పుకోవడంతో తన అభిమాన హీరోను చూడాలని ఏకంగా హైద‌రాబాద్‌కే వ‌చ్చేసింది. అయితే శేష్‌ను చూడగానే రీనా ఉద్వేగానికి లోనయ్యారు. సినిమా త‌న‌కెంతో న‌చ్చింద‌ని తెలిపింది. స‌ర‌దాగా అడవి శేషుతో కొద్ది సేపు ముచ్చటించింది. ఇక ఈ విషయం గురించి తెలుపుతూ శేష్ ట్వీట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా మన హీరోలకు పక్క దేశంలో కూడా అభిమానులు ఏర్పడటం.. ప్రేమతో ఇక్కడి వరకూ రావడం నిజంగా గర్వించతగ్గ విషయమే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =