దోమలకారణంగా ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి పలు వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. పరిసరాల పరిశుభ్రత లేని కారణం గా దోమలు విజృంభిస్తున్నాయి . పరిసరాల పరిశుభ్రత వల్లనే వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని , దానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి KTR అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపాలిటీ, GHMC అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతీ ఒక్కరూ తమ నివాస ప్రదేశాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని KTRసూచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దోమల వల్ల వ్యాపించే వ్యాధులను నివారించడానికి ప్రతీ ఇంటిలో పరిశుభ్రత అవసరమని KTR చెప్పారు. తన ఇంటిని పరిశుభ్రం చేసిన KTR ఆ ఫొటోస్ ను షేర్ చేసి, మీరు కూడా మీ ఇంటిని , పరిసరాలని శుభ్రం చేసిన ఫొటోస్ షేర్ చేయమని ప్రజలనుద్దేశించి ట్వీట్ చేశారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు, దోమల వల్ల ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని, మీ ఇళ్ళ తో పాటు చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండమని KTR ట్వీట్ కు మహేష్ బాబు రీ ట్వీట్ చేశారు.
Dengue & viral fever has become an epidemic in the city. Do an extra bit in keeping your premises & neighborhood free from water stagnation. Be vigilant & take care of yourself, Hyderabad. https://t.co/R3IRomAQjN
— Mahesh Babu (@urstrulyMahesh) September 10, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: