మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘వాల్మీకి’… ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉంటూనే… మరోవైపు తన తదుపరి చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నాడట వరుణ్. తాజా సమాచారం ప్రకారం… `వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, `ఎక్స్ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ని ఓకే చేసాడట ఈ మెగా హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్ను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ నిర్మించనున్నారని టాక్. గతంలో మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్లో ‘ఎక్స్ప్రెస్ రాజా’ వంటి విజయవంతమైన చిత్రం తెరకెక్కింది. ఈ నేపథ్యంలో… మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























