సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ సుంకర, `దిల్` రాజు, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. కాగా… ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కనువిందు చేయనుందని సమాచారం. ఈ చిత్రం ఆరంభంలో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్లో… మహేష్ బాబుతో కలసి తమన్నా సందడి చేస్తుందని టాక్. త్వరలోనే తమన్నా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























