యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ భారీ అంచనాలతో ఆగస్ట్ 30వ తేదీ రిలీజయి మిశ్రమ స్పందన పొందింది. సాహో మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 3రోజులకు సుమారు 300 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సాహో, ఎవరు మూవీ లపై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. సాహో, ఎవరు వంటి అద్భుతమైన మూవీస్ వీక్షించానని, సాహో మూవీ ని టెక్నికల్ గా అద్భుతంగా తెరకెక్కించారని, హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్ కు అభినందనలని, ఎవరు మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారని అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని KTR ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























