మొత్తానికి ఫ్యాన్స్ కు రోజుకో సార్ ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్ ఇప్పుడు తాజాగా తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. తమిళ్ కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సాహో ప్రచారంలో భాగంగా నేడు చెన్నై వెళ్లారు. అక్కడ మూవీ జర్నలిస్టులతో ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ సర్పైజ్ కోసం నేడు 8గంటలకి సత్యం సినిమాస్ కి రండి అంటూ పిలుపునిచ్చారు. దీనితో డార్లింగ్ ప్రభాస్ ఇవ్వబోయే ఆ సడన్ సర్ప్రైజ్ ఏమైయుంటుందా అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. మరి చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ తరహా యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: