వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అన్ని అంచనాలను రీచ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సందేశాత్మకంగా తీయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక సినిమా రెండు మూడు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది మహర్షి విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. ఇప్పటికే 50 రోజులు పూర్తిచేసుకుని రికార్డు క్రియేట్ చేసిన మహర్షి తాజాగా మరో రేర్ ఫీట్ ను కూడా దాటింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూవీ ఐదు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజాగ్,చిలకలూరిపేట,ఆదోని సెంటర్స్ లో మహర్షి నేరుగా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. గుంటూరు,నెల్లూరు లో మాత్రం షిఫ్టెడ్ థియేటర్లలో వంద రోజులు ఆడింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది గొప్ప విషయమే కదా. కాగా మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరి లేరు నీకెవ్వరు సినిమా లో నటిస్తున్నాడు. చూద్దాం ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: