థ్రిల్లర్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలచిన కథానాయకుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సక్సెస్ఫుల్ థ్రిల్లర్స్ తరువాత శేష్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో… నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర ముఖ్య భూమికలను పోషించారు. వెంకట్ రామ్జీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించింది. అడివి శేష్ గత చిత్రం ‘గూఢచారి’కి సంగీతం సమకూర్చిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవలే ‘ఎవరు’కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయన్న సంగతి తెలిసిందే. కాగా… `యు/ఎ` సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 117 నిమిషాల 50 సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి టీజర్, ట్రైలర్తో ఆసక్తిని రేకెత్తించిన ‘ఎవరు’… సినిమాగానూ ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=LoEcmE-6-_s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: