పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి… ఆ పాత్రలకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్లో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేయనున్నట్లు సమాచారం. అది కూడా 22 ఏళ్ళ క్రితం తను పోషించిన పాత్ర తరహాలోదే కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుండగా… మరో లెజెండరీ పొలిటీషియన్ ఎం.జి.రామచంద్రన్గా హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి దర్శనమివ్వనున్నాడు. జయలలిత జీవితంలో… ముఖ్యంగా చెప్పుకోవలసిన మరో పాత్ర తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి. ఈ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’) (1997) సినిమాలోనూ కరుణానిధి తరహా పాత్రలో నటించి విమర్శకుల మెప్పు పొందాడు ప్రకాష్ రాజ్. కాగా…`తలైవి`లో ప్రకాష్ రాజ్ ఎంట్రీ పై త్వరలోనే క్లారిటీ రానుంది.
అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ బయోపిక్… తమిళ, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో రానుంది.
[subscribe]
[youtube_video videoid=GbJdlrnVQMk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: