సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని… పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా గురించి తాజాగా కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియాలో ఓ అప్ డేట్ ఇచ్చారు. సైరా డీఐ చాలా బాగా వచ్చిందని, నైట్ ఎఫెక్ట్స్లో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్.. విజువల్ ఫీస్ట్గా ఉంటుందని కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ పోరాట సన్నివేశాలు.. మెగా ఫ్యాన్స్కు రోమాలు నిక్కబొడిచేలా సీన్స్ ఉంటాయని తెలిపారు.
కాగా ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయన తార, తమన్నా, సుధీప్, విజయ సేతుపతి లాంటి తదితర ప్రముఖ నటీనటులు ఎందరో ఇందులో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=DKGw7ItwTkk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: