సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓ పవర్ఫుల్ రోల్లో రాములమ్మ దర్శనమివ్వనున్నారు. ఆమెతో పాటు మరో టాలెంటెడ్ యాక్ట్రస్ కూడా ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఆ నటి మరెవరో కాదు… సంగీత. `ఖడ్గం`, `పెళ్ళాం ఊరెళితే`, `శివపుత్రుడు`, `ధనం` చిత్రాలలో తన నటనతో అలరించిన సంగీత… దాదాపు పదేళ్ళుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్ళయ్యాక తమిళ చిత్రాలకే పరిమితమైన సంగీత… ఇప్పుడు `సరిలేరు నీకెవ్వరు`తో రీ-ఎంట్రీ ఇవ్వనుండడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే సంగీత రీ-ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… `సరిలేరు నీకెవ్వరు` 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=RQv2OFfXiXc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: