విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్… పలు భాషల్లో సినిమాలను నిర్మించినప్పటికీ లేడీ డైరెక్టర్ల కాంబినేషన్స్లో తెరకెక్కించిన సినిమాలు తక్కువనే చెప్పాలి. సరిగ్గా ఐదేళ్ళ క్రితం శ్రీప్రియ దర్శకత్వంలో `దృశ్యం`ని (2014) నిర్మించగా… మళ్ళీ ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో `ఓ బేబీ`ని నిర్మించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, ఈ రెండు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేమిటంటే… మలయాళ బ్లాక్బస్టర్ `దృశ్యం` ఆధారంగా వెంకటేష్, మీనా కాంబినేషన్ మూవీ `దృశ్యం` తెరకెక్కగా… కొరియన్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా సమంత ప్రధాన పాత్రలో `ఓ బేబీ` రూపొందింది. అంతేకాదు, 2014లో జులై 11న `దృశ్యం` రిలీజ్ కాగా… అదే జులైలో `ఓ బేబీ` ఈ రోజు (జులై 5) రిలీజ్ అయ్యింది. మరి… `దృశ్యం`కి వర్కవుట్ జులై ఫస్టాఫ్ సెంటిమెంట్… `ఓ బేబీ`కి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=sWd2g9JEv0Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: