‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆతరువాత మంచి అవకాశాలతో దూసుకుపోతుంది షాలినిపాండే. షాలిని కూడా మంచి కథలనే ఎంచుకొని కెరీర్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన ‘అర్జున్ రెడ్డి’, ‘మహానటి’, ‘118’ ఇలా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అశ్వనీదత్ తనయ స్వప్నదత్ నిర్మిస్తున్న సినిమాలో షాలిని పాండేకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. పిట్ట గోడ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` హీరో నవీన్ పొలిశెట్టి కథానాయకులుగా నటించనున్నారట. ఇందులో కథానాయికగా షాలినీ పాండే ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులో షాలినీ ఓ న్యాయవాదిగా కనిపించనుందట. స్క్రిప్ట్ పనులు పూర్తిచేసుకున్న ఈసినిమాను.. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట.
మరి పిట్టగోడ సినిమా ఫెయిల్ అయినా కూడా కథ నచ్చి అవకాశం ఇచ్చారట స్వప్న. మరి ఈ సినిమాను ఏం చేస్తాడో చూద్దాం..
[youtube_video videoid=DDgrKCBDS4s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: