ఒక్క టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు సాహో చిత్రయూనిట్. టీజర్ కు ముందు ఇంత లేట్ చేస్తున్నారు… ఈ సినిమాలో అసలు మ్యాటరుందా ఇలా ఒకటోమిటీ ఎన్నో డౌట్లు వచ్చాయి అందరికీ. కానీ ఆ డౌట్లన్నిటికీ ఒక్క టీజర్ తో సమాధానం చెప్పారు. ఈ సినిమా నుండి వచ్చిన 1 నిమిషం టీజరే డిజిటల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు సాహో సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సాహో కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ దరిదాపులో కూడా ఏ ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ చేసేందుకు ధైర్యం చూపించడం లేదు. కనీసం రిలీజ్ కు ఓ పదిరోజుల గ్యాప్ అయినా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇద్దరు హీరోలు అదే రోజున రావడానికి ధైర్యం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్ నటించిన “మిషన్ మంగళ్”,జాన్ అబ్రహాం నటించిన “బాట్లా హౌస్” అదే రోజు విడుదల కానున్నాయి.
“మిషన్ మంగళ్” భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా,జాన్ అబ్రహాం నటిస్తున్న ‘భాట్లా హౌస్” 2008లో ఢీల్లీ జరిగిన తీవ్రవాదుల ఎన్కౌంటర్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు. యధార్ద సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలపై కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆగష్ట్ 15న పెద్ద పోటీనే జరగనుంది. మరి ఈ రేస్ లో ఏ హీరో విన్ అవుతాడో.. చూడాలంటే మాత్రం ఆగష్ట్ 15 వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: