‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఇప్పుడు వేణు దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ ఈరోజు 10:30 నిమిషాలకు రామానాయుడు స్టూడియో లో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫిగా పనిచేస్తున్నారు.
ఇంకా ఈసినిమాలో టబు, ప్రియమణి, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
[subscribe]
[youtube_video videoid=09CDzuJbjeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: