అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా హిందీ చిత్రం ‘ధడక్’తో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న జాన్వి… ప్రస్తుతం ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘కార్గిల్ గర్ల్’లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో… తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించింది జాన్వి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘రూహీ అఫ్జా’ పేరుతో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ మూవీలో రాజ్కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా, జాన్వి రెండు పార్శ్వాలున్న పాత్రలో కనిపించనుంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది జాన్వి.
కాగా… బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చారిత్రాత్మక చిత్రం ‘తక్త్’లోనూ కీలకపాత్ర పోషిస్తోంది జాన్వి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా… ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తున్న శ్రీదేవి తనయకు మంచి ఫలితాలు దక్కాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: