ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రతీ వారం ఆసక్తికరమైన సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఆగస్టులో ముందుగా తెరపైకి రానున్న చిత్రం ‘రణరంగం`. యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆగస్టు 9న కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మన్మథుడు 2’ రిలీజ్ కానుంది.
ఇక మూడో వారంలో… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. అలాగే గతేడాది ‘గూఢచారి’తో సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న అడివి శేష్… ఈ ఏడాది ‘ఎవరు’తో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ వెంకట్ రామ్జి దర్శకత్వం వహించాడు.
ఇక ఆగస్టు ఆఖరి వారం అంటే… ఆగస్టు 30ని టార్గెట్ చేస్తూ నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ కానుంది.
మరి… వీటిలో ఏయే చిత్రాలకు ఆదరణ దక్కుతుందో తెలియాలంటే ఆగస్టు నెల వరకు వేచి చూడాల్సిందే.
[youtube_video videoid=tiZGMxe5B-M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: