తెలుగు, తమిళ్, హిందీ… ఇలా మూడు భాషల్లోనూ కథానాయికగా రాణిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే `దే దే ప్యార్ దే`, `ఎన్జీకే` చిత్రాలతో పలకరించిన రకుల్… ప్రస్తుతం `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రకుల్కి తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్లో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా `మానగరం`(సందీప్ కిషన్), `ఖైదీ` (కార్తి) చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఓ సినిమాని రూపొందించనున్నాడు. కాగా, విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఓ కథానాయికగా సమంత ఎంపిక కాగా, మరో నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ పేరును పరిశీలిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఏదేమైనా… త్వరలోనే రకుల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=UUagLPyfeAc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: