“లక్ష్యమే కాదు దానిని సాధించిన మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి” అంటారు మహాత్మా గాంధీ. అలాగేే ఒక విజయవంతమైన సినిమా ఇవ్వాలి అనే లక్ష్యం మంచిదే అయినప్పటికీ దానిని నిర్మించే సమయము, అందుకు చేసే ఖర్చు కూడా హద్దులు దాట కూడదు. ఈతరం దర్శకులలో కొంతమంది మంచి హిట్ చిత్రాలను ఇవ్వగలుగుతున్నారు గానీ అనుకున్న బడ్జెట్లో , సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఇందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హద్దులు దాటి పోవటమే కాకుండా రకరకాల అనర్థాలకు కారణం అవుతున్నారు సదరు దర్శకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ కొంతమంది యువ దర్శకులు మాత్రం అందుకు భిన్నంగా నియంత్రిత బడ్జెట్ లో, నియమిత కాల వ్యవధిలో హిట్ అనే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంటున్నారు. అలాంటి యువ దర్శకులలో ప్రస్తుతం అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరుసగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2 అనే నాలుగు అద్భుత విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మే 31న, సూపర్ స్టార్ కృష్ణ 77వ జన్మ దినోత్సవ సందర్భంగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది “సరిలేరు నీకెవ్వరు” చిత్రం.
అయితే ఈ ప్రారంభోత్సవంలోనే ఈ చిత్రాన్ని 2020- సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ నటించే చిత్రాన్ని కేవలం ఏడు నెలల కాలంలో పూర్తిచేసి విడుదల చేస్తాననడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే పనేనా? అన్నది సినీ ప్రముఖుల సందేహం. నిజానికి వారి సందేహం పట్ల ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు.
ఎందుకంటే స్టార్ సినిమా అనగానే వంద కోట్ల పై బడిన బడ్జెట్టు, వందలాది వర్కింగ్ డేస్ , హంగు ఆర్భాటం వంటివి తప్పని పరిస్థితి. చిత్ర నిర్మాణంలోని చాలా అంశాలు నిర్మాత పరిధి దాటి చేజారిపోయిన పరిస్థితుల్లో నియమిత బడ్జెట్ లో, నియమిత కాల వ్యవధిలో సినిమాను పూర్తి చేయటం కత్తి మీద సాము లాంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ సినిమాను ఏడు నెలల కాల వ్యవధిలో రిలీజ్ కు సిద్ధం చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించటం అభినందనీయం. అలా చేయగలిగితే “నిజంగా గ్రేట్” అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు.
ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు స్పందిస్తూ “సరిలేరునీకెవ్వరు” చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు దిల్ రాజు, అనిల్ సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి ఓపెనింగ్ రోజే ప్రకటించటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం వర్కింగ్ స్టయిల్ మారిపోయింది. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అంటూ టెక్నాలజీ పేరుతో చిత్ర నిర్మాణంలో చాలా కాలయాపన జరుగుతుంది.
ఇలాంటి స్థితిలో నిజంగా వాళ్ళు వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయగలిగితే వాళ్లకు స్వయంగా నేనే సన్మానం చేస్తాను”.అన్నారు ఆదిశేషగిరిరావు.నిజంగా ఆదిశేషగిరిరావు స్పందనలో గొప్ప అర్థం ఉంది. సినిమా అన్నది నిర్మాణ దశలోనే కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్న ఈ రోజుల్లో ఒక సూపర్ స్టార్ సినిమా7 ఏడు నెలల్లోనే రిలీజ్ కు రెడీ అయితే ఆ దర్శకనిర్మాతలకు నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి.
వేచి చూద్దాం…. “సరిలేరు నీకెవ్వరు” టీమ్ చెప్పిన టైంకు సినిమాను రిలీజ్ చేసి మీసం మెలేసి ఆదిశేషగిరిరావు సన్మానాన్ని అందుకుంటారో లేదో.. వేచి చూద్దాం…..
[subscribe]
[youtube_video videoid=zbUaqedhYMQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: