సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. ఎంతో మంది హీరోల కొడుకులు, కూతుళ్లు.. మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వారిలో కొంత మంది సక్సెస్ కావచ్చు.. కొంత మంది సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ ఈ సంప్రదాయం మాత్రం నిరంతరం జరిగే ప్రక్రియే. ఇప్పుడు కొంత మంది యంగ్ హీరోలు.. హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ప్రస్తుతం వారు టాలీవుడ్ లో తమ టాలెంట్ చూపించుకుంటూనే.. తమ తమ్ళుళ్లను కూడా వెండి తెరకు పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వారెవరో ఒకసారి చూద్దామా..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాందించుకున్న యంగ్ టాలెంటెడ్ అండ్ టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ హీరో విజయ దేవరకొండ. ఇప్పుడు విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా.. హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా దొరసాని. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా జులై 5వ తేదీన రిలీజ్ కానుంది.
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా తెలుగు తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు
జయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పుడు ఆయన తన తమ్ముడు గణేష్ ను కూడా వెండి తెరకు పరిచయం చేయనున్నాడు. అయితే బెల్లంకొండ గణేష్ కు తెలుగు ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. తన తండ్రి బెల్లంకొండ సురేష్ తో కలిసి చాలా సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. నూతన దర్శకుడు ఫణి దర్శకత్వంలో ఇంకా టైటిల్ ఖరారు కాని ఓ సినిమాలో గణేష్ నటిస్తున్నాడు.
రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుందరి రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ కు వచ్చిన తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు బాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు రకుల్ కూడా తన తమ్ముడిని తెలుగు తెరకు పరిచయం చేయడానికి సిద్దమయింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఈ చిత్రంతో మోనికా శర్మ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మరి వీరిలో ఎంత మంది సక్సెస్ అవుతారో.. ఎంత మంది టాలీవుడ్ లో నిలదొక్కుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అంతేకాదు వీరందరి సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. మరి రిలీజ్ అయితే కానీ ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేం..
[subscribe]
[youtube_video videoid=Of_rUUmBbiE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: