ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేయనున్నాడు. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి సుమంత్ హీరోగా ఓ కొత్త సినిమా రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ లో చూపించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాకు సంతోష్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాతోనే ఆయన తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ యాక్షన్ డ్రామా ను సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకలపై పి.జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన సిమ్రత్ నటించనుంది. సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్.
“ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు” అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంజన ప్రొడక్షన్స్ అధినేత పి.జగన్ మోహన్ రావు అన్నారు.
[subscribe]
[youtube_video videoid=NfoWMS7Lj5g ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: