వెంకటేష్ మహా దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. విశాఖపట్నానికి చెందిన కంచరపాలెం అనే ప్రాంతంలో అక్కడి స్థానికులనే ప్రధాన పాత్రధారులుగా ఎంపిక చేసి రూపొందించిన ఈసినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఈసినిమాను తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘శైవం’తో పాటు తెలుగులో ‘కలర్స్’ స్వాతి, నవీన్ చంద్ర ముఖ్య తారలుగా ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించిన యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ మధ్య నేను చూసిన బెస్ట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’… ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్ అయ్యాను.. అంతే వెంటనే సురేష్ బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్ చెల్లించి ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్ను సొంతం చేసుకున్నానని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు… మలయాళ వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం… జూన్ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు.
[subscribe]
[youtube_video videoid=31qtlsM5dbg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: