యువ కథానాయకుడు రామ్కి కలిసొచ్చిన దర్శకులలో కిషోర్ తిరుమల ఒకడు. వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన ‘నేను శైలజ’(2016) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అనంతరం ‘ఉన్నది ఒకటే జిందగీ’(2017)తోనూ ఈ కాంబినేషన్ అలరించింది. ఈ నేపథ్యంలో… ముచ్చటగా మూడోసారి ఈ ద్వయం జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘తడమ్’ను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతేకాదు… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని సమాచారం.
రామ్ నటిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే… తడమ్
రీమేక్ వెర్షన్పై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: