‘ఊపిరి’(నాగార్జున)… ‘ప్రేమమ్’, ‘మజిలీ’(నాగచైతన్య)… ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోస్ మెమరబుల్ మూవీస్లో భాగమైన మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్… ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాకి కూడా సంగీతం అందించనున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్న అఖిల్కు… విజయం మాత్రం ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ వంటి చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న భాస్కర్తో తన తదుపరి చిత్రం చేయనున్నాడు ఈ అక్కినేని వారసుడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్టు ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. భాస్కర్ కూడా ఈ సినిమాకు తనకు ‘బొమ్మరిల్లు’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ను అందించిన దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావించాడట. అయితే నిర్మాత అల్లు అరవింద్ మాత్రం… తన బ్యానర్లో రీసెంట్ బ్లాక్బస్టర్ ‘గీతగోవిందం’కి మ్యూజిక్ను అందించిన గోపీసుందర్ వైపే మొగ్గు చూపుతున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే… నాగ్, చైతులకి కలిసొచ్చిన గోపీసుందర్ అఖిల్కు ఏమేర కలిసొస్తాడో చూడాలి. త్వరలో ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=D-xVnEavqYs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: