2018 సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో టాలీవుడ్కు తొలి విజయాన్ని అందించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. కట్ చేస్తే… ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తెలుగులో (స్ట్రెయిట్ ఫిలింతో) ఎప్పటినుంచో హిట్టు కొట్టాలని ఎదురు చూసిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్కి ‘జైసింహా’ విజయంతో ఆ లోటు తీరిపోయింది. ఈ నేపథ్యంలో తనకి తెలుగులో తొలి విజయాన్ని అందించిన బాలయ్యతోనే మరోసారి సినిమాని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడట రవికుమార్. అంతేకాదు… మే నెలలో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి… జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకునివెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నాడట ఈ దర్శకుడు. మరోవైపు… ‘జైసింహా’ను నిర్మించిన నిర్మాత సి.కళ్యాణ్ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ను కూడా నిర్మించనున్నాడట. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా… బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కనున్న చిత్రం ఆగష్టు నుంచి ప్రారంభం కానుందని టాక్.
[subscribe]
[youtube_video videoid=Beb6rhfh8Ew]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: