ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లే డి హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తో పాటుగా కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై తో హీరో అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాను తెలుగు తోపాటు తమిళం ,కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దిగంత్ ముఖ్య పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 10 సంవత్సరాల తరువాత దిగంత్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా దిగంత్ గతంలో ఎమ్మెస్ రాజు నిర్మాణం లో వచ్చిన వాన చిత్రంలో నటించాడు. మళ్లీ ఇన్నేళ్లకు విజయ్ దేవరకొండ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
[subscribe]
[youtube_video videoid=MFQv_mS6icI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: