హవీష్ కథానాయకుడిగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సెవెన్. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్కరి పాత్రను ఒక్కో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్రయూనిట్. దీంతో ఈ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రమేష్ వర్మ మాట్లాడుతూ.. ఆరుగురు అమ్మాయిలు… ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? వీటన్నింటికి సమాధానం దొరకాలన్నా.. ఆ సస్పెన్స్ తెలియాలన్నా సినిమా చూడాల్సిందే అని అంటున్నారు.
అంతేకాదు.. ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నామని తెలిపారు. మరి చూద్దాం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో..
[subscribe]
[youtube_video videoid=rXMFaLsP4yU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: