నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకుడి లక్షణం
అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో… “ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి” అంటూ తన పరిపాలనా దక్షతతో ప్రజల మన్ననలు పొందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలో సూపర్స్టార్ మహేష్బాబు ఆద్యంతం అలరించాడు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, దేవరాజ్, రావు రమేష్, శరత్ కుమార్, సితార, ఆమని, అజయ్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో రూపొందిన పాటలన్నీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా “వచ్చాడయ్యో సామి” పాట విశేషాదరణ పొందింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా… మహేష్ కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచింది. 2018 ఏప్రిల్ 20న విడుదలైన భరత్ అనే నేను
… నేటితో ఏడాది పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
[youtube_video videoid=zoMDxBkQfp8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: