‘హలో’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా కళ్యాణి నితిన్ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న వస్తున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నితిన్కు జోడీగా రష్మిక మందన్నను ఎంపిక చేసింది చిత్ర బృందం. అలాగే… మరో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై స్పందించిన డైరెక్టర్ వెంకీ క్లారిటీ ఇచ్చారు. తన సినిమాలో హీరోయిన్ కేవలం రష్మిక మందన మాత్రమే అని.. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ కు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Rashmika Mandanna is the only female lead in Nithin starrer #Bheeshma produced under Sithara entertainments ! Cast and crew details vl announce soon 😊🙏🏻@actor_nithiin @iamRashmika @vamsi84 @SitharaEnts
— Venky Kudumula (@VenkyKudumula) April 16, 2019
[subscribe]
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: