`రంగం` సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు జీవా. ఇప్పుడు మరోసారి `కీ` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కలీస్ దర్శకత్వంలో జీవా ప్రధాన పాత్రలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే సుకుమార్ చేతుల మీదగా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో జీవా సరసన నిక్కి గల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్గా నటించారు. ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కృష్ణ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ బేనర్స్ పై నిర్మిస్తున్నారు. టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో..ఉపయోగం ఎంత ఉంటుందో, నష్టం కూడా అంతే ఉంటుంది. సాంకేతికతలోని మరో కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మరి రంగం సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టిన జీవాకు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























