గత ఏడాది వేసవిలో `మహానటి`గా మురిపించిన కేరళకుట్టి కీర్తి సురేష్… స్వల్ప విరామం తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు నరేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని `118` ఫేమ్ మహేష్ కోనేరు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నదియా, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ… రూ.50 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో జరుగుతోందని సమాచారం. ఈ దృశ్యాల చిత్రీకరణ పూర్తయ్యాక… చిత్ర బృందం విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసింది. మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరుగుతుందని టాక్. ఇదిలా ఉంటే… ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి… `మహానటి` తరువాత తెలుగులో చేస్తున్న ఈ స్ట్రయిట్ పిక్చర్ కీర్తికి ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: