కింగ్ నాగార్జున నటించిన పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. వాటిలో `నిన్నే పెళ్ళడతా` ఒకటి. 1996లో విడుదలైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఆ సినిమాలో నాగ్కి అమ్మగా మహాలక్ష్మి పాత్రలో ఎంతో సహజంగా నటించిన సీనియర్ హీరోయిన్ లక్ష్మి… సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ నాగ్కి తల్లి పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ సారి కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసమే ఈ ఇద్దరూ తల్లీకొడుకులుగా నటించబోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే… `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ మూవీ… ఇటీవలే పట్టాలెక్కింది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో… నాగ్, లక్ష్మి మధ్య సాగే సన్నివేశాలు `నిన్నే పెళ్ళడతా` తరహాలో సహజంగా ఉంటాయని తెలుస్తోంది. మరి… 23 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరూ మరోసారి అలరిస్తారేమో చూడాలి. అన్నట్టు… `నిన్నే పెళ్ళాడతా`ని నిర్మించిన నాగార్జునే ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. కాగా… రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=ruEcJyx3c3M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: