`సంతోషం`… కింగ్ నాగార్జున కెరీర్లో మెమరబుల్ ఫిల్మ్. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా… పలు పురస్కారాలను అందుకుంది. అలాంటి… ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు దశరథ్. ఆ తరువాత దశరథ్ డైరెక్షన్లో వచ్చిన `సంబరం`, `శ్రీ`, `స్వాగతం` ఆశించిన విజయాలను సాధించకపోయినా… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో రూపొందించిన యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `మిస్టర్ పర్ఫెక్ట్`… దశరథ్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి తీసుకువచ్చింది. అలాగే… తన తొలి చిత్ర కథానాయకుడు నాగ్తో తెరకెక్కించిన `గ్రీకు వీరుడు` ఓకే అనిపించుకుంది. అయితే… ఆ తరువాత వచ్చిన `శౌర్య` పూర్తిగా నిరాశపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… స్వల్ప విరామం తరువాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నాడని తెలిసింది. ఈ సారి నాగ్ తనయుడు నాగచైతన్యతో దశరథ్ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు… ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని టాక్. త్వరలోనే చైతూ, దశరథ్ కాంబో మూవీపై క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: