చెన్నై బ్యూటీ సమంత కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాలలో `మనం` ఒకటి. అందులో… రెండు విభిన్న పాత్రల్లో సామ్ అభినయం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా… కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్లో సమంత నటించిన సన్నివేశాలన్నీ అలరించేలా ఉంటాయి. `మనం`లో నాగ్కి తల్లి పాత్రలో కనిపించిన సామ్… ఆ తరువాత `రాజు గారి గది 2`లోనూ మరోసారి కలిసి నటించింది. అయితే… నాగచైతన్యని పెళ్ళాడాకా… నాగ్తో మళ్ళీ కలసి నటించని సామ్… అతి త్వరలో ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నాగార్జున కథానాయకుడిగా `మన్మథుడు`కి సీక్వెల్గా రాహుల్ రవీంద్రన్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటిస్తున్నారని సమాచారం. అలాగే… ఓ కీలక పాత్రలో సామ్ కూడా దర్శనమివ్వనుందట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమని… దాదాపు 6 నిమిషాల పాటు సాగే ఈ పాత్రే కథను మలుపు తిప్పుతుందని టాక్. త్వరలోనే సామ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనున్న `మన్మథుడు` సీక్వెల్… మార్చి 15 నుంచి పట్టాలెక్కనుంది. విదేశాల్లో సింహభాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: