మెగా కాంపౌండ్లో తారల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అందుకే… ఏడాది పొడవునా ఈ కాంపౌండ్ నుంచి కనీసం అరడజను నుంచి పది చిత్రాలైనా తెరపై వినోదాన్ని పంచుతూ మెగాభిమానులను మురిపిస్తున్నాయి. ఇక… ఈ ఏడాది వేసవిలో అయితే… ఏకంగా మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ అభిమానుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలే `ఏబీసీడీ`, `సూర్యకాంతం`, `చిత్రలహరి`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`ఒక్క క్షణం` తరువాత స్వల్ప విరామం తీసుకున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్… ఈ వేసవికి `ఏబీసీడీ`తో సందడి చేయనున్నాడు. మలయాళ చిత్రం `ఏబీసీడీ`కి రీమేక్గా తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మార్చి 21న తెరపైకి రానుంది. ఆ సినిమా విడుదలైన వారం రోజుల తరువాత మరో మెగా ఫ్యామిలీ వారి సినిమా రాబోతోంది. అదే… `సూర్యకాంతం`. నిహారిక టైటిల్ రోల్లో నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మార్చి 29న సిల్వర్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఇక మరో మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `చిత్రలహరి` ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. అంటే… కేవలం నెల రోజుల గ్యాప్లో ముచ్చటగా మూడు మెగా ఫ్యామిలీ మూవీస్ సందడి చేయబోతున్నాయన్నమాట. మరి… ఈ మెగా ఫ్యామిలీ ప్యాక్… బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్ళ వర్షం కురిపిస్తుందో చూడాలి.
[youtube_video videoid=HDi6c2gjavA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: