డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలంటే… `సమ్థింగ్ స్పెషల్`గా అనిపించే హీరో క్యారెక్టరైజేషన్స్కు మాత్రమే కాదు `ప్రత్యేకం`గా సాగే గీతాలకు కూడా చోటు ఉంటుంది. ఇక పూరి కెరీర్ బెస్ట్ హిట్ `పోకిరి`లోని ప్రత్యేక గీతం `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే` ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాటకి మణిశర్మ అందించిన బాణీ, ముమైత్ ఖాన్ నృత్యాలు ప్రధాన బలంగా నిలిచాయి. ఆ పాట తరువాత ముమైత్ పలు ఐటమ్ సాంగ్స్లో మెరిసి… `స్టార్ ఐటమ్ గాళ్`గా పేరు తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఇప్పుడు అదే మణిశర్మ కాంబినేషన్లో చాన్నాళ్ళ తరువాత పూరి జగన్నాథ్ కలసి పనిచేస్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. ఈ పాట కూడా `ఇప్పటికింకా` తరహాలోనే ట్రెండ్ సృష్టించేలా ఉంటుందని ఇన్సైడ్ సోర్స్ టాక్. ఇప్పటికే… ఈ పాట రికార్డింగ్ కూడా అయ్యిందని… త్వరలోనే ఈ గీతాన్ని చిత్రీకరించనున్నారని సమాచారం. మరి… `ఇప్పటికింకా` తరహాలోనే ఈ పాట కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి. కాగా.. `ఇస్మార్ట్ శంకర్` మే నెలలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=2rRlDrGXa18]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: