2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ చిత్రాలే… `యన్.టి.ఆర్.కథానాయకుడు`, `పేట`, `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. ఈ నాలుగు సినిమాలూ అగ్ర కథానాయకుల చిత్రాలు కావడం ఓ విశేషమైతే… మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే… ఈ సంక్రాంతి మూవీస్లో… ఆ యా హీరోలకు జోడీగా నటించిన వారంతా మొదటిసారిగా నటించిన వారే కావడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `యన్.టి.ఆర్. కథానాయకుడు` విషయానికి వస్తే… ఇందులో నటసింహ నందమూరి బాలకృష్ణకి జోడీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ తొలిసారిగా నటించింది. ఇక తమిళ అనువాద చిత్రం `పేట` విషయానికి వస్తే… సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తొలిసారిగా సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్, త్రిష నటించారు. అలాగే `వినయ విధేయ రామ` విషయానికి వస్తే… మెగాపవర్ స్టార్ రామ్ చరణ్కు జోడీగా మొదటి సారిగా కియరా అద్వాని నటించింది. చివరగా `ఎఫ్ 2` విషయానికి వస్తే మరో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్కి జోడీగా తమన్నా ఫస్ట్ టైమ్ కథానాయికగా నటించగా… యువ కథానాయకుడు వరుణ్ తేజ్కి జోడీగా మెహరీన్ కూడా తొలిసారిగానే జట్టుకట్టింది. మొత్తానికి… ఈ సంక్రాంతి సీజన్లో ఫస్ట్ టైమ్ కాంబినేషన్లు బాగానే సందడి చేశాయనే చెప్పాలి.
[youtube_video videoid=zApfsNJJR8Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: