సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కనున్న ఈ సినిమా… త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… ఆ పాత్రలో ఓ బాలీవుడ్ భామ నటించబోతుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు… దాదాపు 15 ఏళ్ళుగా బాలీవుడ్లో రాణిస్తున్న అందాల తార కత్రినా కైఫ్. తెలుగులో `మల్లీశ్వరి`, `అల్లరి పిడుగు` చిత్రాల్లో నటించిన కత్రినా… ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణించిన సంగతి తెలిసిందే. మధ్యలో… కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ల కోసం కత్రినా పేరు పరిశీలించినా… వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో… మహేష్ చిత్రంలోనైనా కత్రినా కన్ఫర్మ్ అవుతుందో లేదంటే వార్తలకే పరిమితమవుతుందో చూడాలి.
[youtube_video videoid=tjGnRo_TFHw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: