సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వైజాగ్ లో పోర్ట్ ప్రధానంగా పలు కీలక సన్నివేశాలు, అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ని భారీ స్థాయిలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించినట్టు సమాచారం. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ మేరకుఅల్లు అర్జున్ వైజాగ్ బీచ్లో దిగిన ఫోటోని పంచుకున్నారు. థ్యాంక్యూ వైజాగ్ అంటూ పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో బన్నీ ఈ పోస్ట్ షేర్ చేశారు. విశాఖపట్నం తనకు ఎప్పుడూ చాలా స్పెషల్ అని పేర్కొంటూ లవ్ సింబల్ పంచుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోటో, ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వైజాగ్ నుంచి బన్నీ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: