టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజింగ్ ఇస్తూనే ఉంటాడు. గత కొన్నేళ్లుగా దేవరశాంటా పేరుతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బహుమతులు అందిస్తున్నాడు. గత ఏడాది క్రిస్మస్ కు ఫ్యాన్స్ కు దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్ కు బహుమతి అందించాడు. దాదాపు 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ అందించాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా మరో బంపరాఫర్ తో వచ్చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటూ ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించాడు. దేశంలోని పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, సాంస్కృతిక ప్రాంతాల పర్యటన, దేశంలోని ఎడారి ప్రాంతాల పర్యటన ప్రాంతాలను విజయ్ ఎంపికచేయగా.. అందులో ఎక్కువ శాతం.. పర్వత ప్రాంతాల పర్యటనకు ఓటేయగా, సముద్ర తీర ప్రాంతాల పర్యటనకు పంపాలని 24 శాతం మంది, సాంస్కృతిక పర్యటనే మేలంటూ 27.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరి వీరిలో 100 మందిని ఎలా ఎంపిక చేస్తాడనేది చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఈ ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఆసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తెలుగులో ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన సినిమా చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: