చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ2. ఈసినిమా నిఖిల్ ను సూపర్ హిట్ అందించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్. దీంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు, పోస్టర్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 13న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చందూ మొండేటి కార్తికేయ 3 గురించి కూాడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశారు. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యపురం నేపథ్యంలో తెరకెక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని తుని గ్రామంలో తలుపులమ్మ టెంపుల్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా కార్తికేయ సినిమాను తెరకెక్కించాం. కార్తికేయ2 సినిమా ద్వారకా కృష్ణ నేపథ్యంలో వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే 3వ భాగం ఉంటుంది. 3వ భాగాన్ని అంతర్జాతీయస్థాయిలో ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాము. ఆ దిశగానే కథపై కసరత్తు జరుగుతోంది” అని అన్నాడు. ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని ఎలా చెప్పామో .. సెకండ్ పార్టుకు మించి థర్డ్ పార్టు ఉంటుందని అంతే నమ్మకంగా చెబుతున్నాను అని తెలిపాడు. మరి మూడో పార్ట్ ను ఏ బ్యాక్ డ్రాప్ లో తీస్తాడబ్బా అని ఇప్పటినుండే ఆలోచనలు మొదలయ్యాయి అందరిలో.
ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: