పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను యాక్షన్ చిత్ర హీరో విశాల్ అలరిస్తున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కిన “లాఠీ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ”డిటెక్టివ్ 2 ” మూవీలో హీరోగా నటిస్తూ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో విశాల్ మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మినీ స్టూడియో బ్యానర్ పై విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ 33 మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ “మార్క్ ఆంటోని ” మూవీ తెరకెక్కుతుంది. రీతూ వర్మ కథానాయిక కాగా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో హీరో విశాల్ , ఎస్ జె సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం.“లాఠీ” షూటింగ్ లో హీరో విశాల్ అనేక సార్లు గాయాల పాలయిన విషయం తెలిసిందే. ఇప్పుడు “మార్క్ ఆంటోని ” మూవీ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా విశాల్ తీవ్ర గాయాల పాలయినట్టు సమాచారం. మొత్తానికి అయితే తన సినిమాల విషయంలో విశాల్ మాత్రం చాలా రిస్కులు తీసుకుంటున్నాడని చెప్పాలి, విశాల్ ఆరోగ్యంతో కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: