ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో అల్లు అర్జున్ ముంబై లో సమావేశం అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందనే అభిప్రాయం ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ “ఖామోషి” మూవీ తో బాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన సంజయ్ “హమ్ దిల్ దే చుకే సనమ్”, “దేవదాస్ “, “బ్లాక్ “, “బాజీరావు మస్తానీ”, “పద్మావత్” బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సంజయ్ “గంగూ భాయ్ కతియా వాడి ” మూవీ తో అలరించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను సంజయ్ నిర్మించారు. ఇప్పుడు ఆ దిగ్గజ నిర్మాత , దర్శకుడి ని అల్లు అర్జున్ కలవడంతో ఊహా గానాలు ఎక్కువ అయ్యాయి. అయితే ఆదర్శకుడిని అల్లు అర్జున్ క్యాజువల్ గా కలిశారనీ ,వారిద్దరి మధ్య మూవీ డిస్కషన్ ఏదీ జరగలేదనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: