పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక మందన్న తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక “ఆడవాళ్లు మీకు జోహార్లు”మూవీ 25 వ తేదీ విడుదల సందర్భంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. ప్రేమ , పెళ్ళి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు వ్యక్తులు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుందనీ , అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుందనీ , తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాననీ చెప్పారు. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్ పైనే పెట్టినట్లు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: