గత రెండేళ్లలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో చూశాం. ఎన్నో పరిశ్రమలు చాలా దెబ్బతిన్నాయి ఈ కరోనా ప్రభావం వల్ల. అలానే సినీ పరిశ్రమలు కూడా చాలా నష్టపోయాయి. ఎన్నో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఎన్నో వేల కోట్ల నష్టం జరిగింది. అలానే కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక గత కొద్దినెలలుగా పరిస్థితులు కాస్త సర్దుకోగా ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈవిషయాన్ని స్వయంగా తనే తన ట్విట్టర్ ద్వారా తెలియచేయడంతో ఈవిషయం అందరికీ తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల తన వ్యక్తిగత పనిమీద యూఏస్ వెళ్లారు కమల్. అమెరికా నుంచి తిరిగొచ్చిన తరువాత దగ్గు, జలుబు వచ్చిందని, దీంతో వెంటనే టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. పాండమిక్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ రిక్వెస్ట్ చేశారు. దీంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
ఇక కమల్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: