ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 1966 సంవత్సరం డిసెంబర్ 15 వ తేదీ “శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న ” మూవీ తో సింగర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత బాలు ,కన్నడ తమిళ , మలయాళ భాషలకు సింగర్ గా పరిచయం అయ్యి తన గానామృతం తో ప్రేక్షకుల ను వీనుల విందు చేశారు. 1980 సంవత్సరంలో “శంకరాభరణం ” మూవీ లోని సాంగ్స్ అద్భుతంగా గానం చేసిన బాలు బెస్ట్ సింగర్ గా ఫస్ట్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.ఐదున్నర దశాబ్దాలుగా 16 భాషలలో 40,000 సాంగ్స్ పాడి బాలు రికార్డ్ క్రియేట్ చేశారు. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ , యాక్టర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ , నిర్మాతగా చిత్రపరిశ్రమకు బాలసుబ్రహ్మణ్యం సేవలందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్ 25 వతేదీ 01:04 PM కు సంగీతాభిమానులను శోక సంద్రంలో విడిచి బాలు స్వర్గస్థులయ్యారు.పాట ఉన్నంత వరకూ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోట్లాది ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డ్ దక్కగా., .ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డ్ అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























