ఇన్ని రోజులు కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇక హీరో హీరోయిన్స్ కూడా తమ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే హీరోయిన్ తమన్నా తన సినిమాల డబ్బింగ్ కార్యక్రమాలను చకచకా పూర్తి చేసుకుంటుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో మ్యాస్ట్రో అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.ఇక తమన్నా ‘మాస్ట్రో’మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా డబ్బింగ్ పనులను ఇటీవలే మొదలుపెట్టిన తమన్నా.. ఇప్పుడు తన డబ్బింగ్ ను పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాస్ట్రో డబ్బింగ్ అయిన వెంటనే గుర్తుందా శీతాకాలం డబ్బింగ్ ను మొదలుపెట్టింది. ఇక తమన్నా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తోంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మరోవైపు గోపీచంద్ ‘సీటీమార్’తో పాటు ఇంకోవైపు తమన్నా సత్యదేవ్తో కలిసి ‘స్కైలాబ్’ సినిమా చేస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: