కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఈసినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్యహీరోగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా తీయనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం ధనుష్ తన తెలుగు సినిమా మేకర్స్ తో హైద్రాబాద్ లో ఈరోజు మీట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈమీటింగ్ లో శేఖర్ కమ్ముల, డైరెక్టర్ నారాయణదాస్ నారంగ్, సోనాలి నారంగ్, భరత్ నారంగ్ మరియు పి.రామ్ మోహన్ లను కలసి కాసేపు ముచ్చటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: