ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , అనసూయ ముఖపాత్రలలో నటిస్తున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. “పుష్ప “మూవీ లో పడవ ప్రయాణం బ్యాక్డ్రాప్లో ఒక యాక్షన్ సీన్ ఉందనీ , ఆ యాక్షన్ సీన్ వన్నాఫ్ ది హైలైట్ గా ఉంటున్నదనీ సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: